
కృష్ణపట్నం: శుక్రవారం నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దని తెలిపారు ఆనందయ్య. శుక్రవారం ఆయన వీడియో రూపంలో కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు. మందు పంపిణీపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తిరిగి పంపిణీ చేస్తామని.. ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు. అప్పటివరకు ఎటువంటి వాట్సాప్ మెసేజ్ లు నమ్మవద్దన్న ఆనందయ్య.. ప్రస్తుతానికి తన దగ్గర ఎటువంటి ఔషదం తయారికి సంబంధించిన ద్రవ్యాలు లేవన్నారు.