తల్లి మరణంపై యాంకర్ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్

తల్లి మరణంపై యాంకర్ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యాంకర్  విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. గురువారం ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా తెలియజేశారు.  తన తల్లితో ఉన్న ఫోటోను షేర్ చేసిన విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యింది. ‘ మై డియర్ అమ్మ ఈ రోజు వరకకు నాకు  తోడుగా ఉన్నందుక ధన్యవాదాలు. నా తుది శ్వాస  విడిచే వరకు  నీ పేరు నిలబెడుతా. నువ్వే నా బలం.. నువ్వే నా బలహీనత. ప్రతిక్షణం, నా ప్రతి  శ్వాసలో కూడా ఉంటావు.  నాకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. నీ త్యాగాలన్నింటికి జీవితాంతం రుణపడి ఉంటా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ అమ్మా’’ అంటూ భావోధ్వేగమైన పోస్ట్ చేసింది విష్ణుప్రియ. పలువురు బుల్లితెర యాంకర్స్, నటులు  విష్ణు ప్రియకు ధైర్యం చెబుతూ  పోస్టులు పెడుతున్నారు.