ఏపీలో డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే 

ఏపీలో డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే 

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలోనే డిగ్రీ కోర్సులు నడవనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లీష్ బోధనపై ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఇంగ్లీష్ మీడియాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.