- ఆఫీసర్లను నిలదీసిన స్థానికులు...!
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ అర్భన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి హౌసింగ్ బోర్డు అంగన్ వాడీ మొదటి సెంటర్కు చెత్త వాహనాల్లో తీసుకుపోయే రేషన్ బియ్యం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక రేషన్షాపు నుంచి అంగన్వాడీ సెంటర్కు 78 కేజీల బియ్యం అలాట్చేశారు. ఈ బియ్యాన్ని గురువారం మున్సిపాలిటీ చెత్త బండిలో వేసి తరలించేందుకు మున్సిపల్, అంగన్వాడీ సిబ్బంది సిద్ధమయ్యారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే బియ్యాన్ని చెత్త వాహనంలో రవాణా చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్తహసీల్దారు అనిల్ సిబ్బందిని హెచ్చరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ రేవతి మాట్లాడుతూ గత నెల నుంచి అంగన్ వాడీ సరకుల రవాణాకు పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు మున్సిపల్ వాహనాలను వాడుతున్నట్లు చెప్పారు.