చెత్త వాహనాల్లో అంగన్​వాడీ బియ్యం తరలింపు 

చెత్త వాహనాల్లో అంగన్​వాడీ బియ్యం తరలింపు 
  • ఆఫీసర్లను నిలదీసిన స్థానికులు...!

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ అర్భన్​ ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​ పరిధి హౌసింగ్ బోర్డు అంగన్ వాడీ మొదటి  సెంటర్​కు చెత్త వాహనాల్లో తీసుకుపోయే  రేషన్​ బియ్యం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక రేషన్​షాపు నుంచి అంగన్​వాడీ సెంటర్​కు 78 కేజీల బియ్యం అలాట్​చేశారు. ఈ బియ్యాన్ని గురువారం మున్సిపాలిటీ చెత్త బండిలో వేసి తరలించేందుకు మున్సిపల్, అంగన్​వాడీ సిబ్బంది  సిద్ధమయ్యారు.  బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు  అందించే బియ్యాన్ని చెత్త వాహనంలో రవాణా చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఇన్​ఛార్జ్​తహసీల్దారు అనిల్​ సిబ్బందిని హెచ్చరించారు. ఐసీడీఎస్​ సూపర్ వైజర్ రేవతి మాట్లాడుతూ గత నెల నుంచి అంగన్ వాడీ సరకుల రవాణాకు పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు మున్సిపల్​ వాహనాలను వాడుతున్నట్లు చెప్పారు.