
కొడంగల్, వెలుగు: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు నష్టం కలిగించే జీఓ.10ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం కొడంగల్ వస్తున్నారని తెలియడంతో అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తెచ్చిన జీఓ.10 కింద టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50వేల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రకటించగా.. అప్పట్లో అంగన్వాడీలు వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టారు.
ఆ తర్వాత టీచర్లకు రూ. 2లక్షలు, హెల్పర్లకు రూ. లక్షతో పాటు వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత జీఓను అమలు చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.