
పతనం చివరి దాకా వెళ్లిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఫీనిక్స్ పక్షి మాదిరిగా వేగంగా తిరిగి పుంజుకుంటున్నారు. ప్రధానంగా అయన తన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీలను తన అభివృద్ధికి బలమైన పిల్లర్లుగా నిర్మించుకుంటున్నారని తెలుస్తోంది. అనిల్ ప్రస్తుతం కొత్త వ్యాపారాల్లోకి కూడా వరుసగా ఎంట్రీ ఇవ్వటం పెట్టుబడిదారుల్లో కొత్త జోష్ నింపుతోంది.
ప్రస్తుతం భారత రక్షణ రంగంపై రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ బెట్ వేస్తోంది. ఈ క్రమంలో భారతీయ మిలిటరీ విమానాల అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా రూ.5వేల కోట్ల వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో దోశంలో తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్ట్ చేపడుతున్న కంపెనీగా రిలయన్స్ ఇన్ ఫ్రా నిలవనుందని వెల్లడైంది. వాస్తవానికి ఇలాంటి వాటిని కేవలం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మాత్రమే చేపడుతుంటాయి.
ALSO READ | గౌతమ్ అదానీ శాలరీ కంటే.. ఆయన కంపెనీలో పనిచేసేటోళ్ల శాలరీలే ఎక్కువ !
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఇప్పటికే రూ.350 కోట్ల ఒప్పందం కింద హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన జెనెసిస్ భాగస్వామ్యంతో 55 డోర్నియర్-228 విమానాల అప్గ్రేడ్ను పూర్తి చేసింది. వాస్తవానికి మెుదట 37 విమానాల కోసం ఆర్డర్ అందుకోగా.. విజయవంతమైన డెలివరీ కారణంగా మరో 18 యూనిట్ల కోసం కంపెనీ ఆర్డర్ అందుకున్నట్లు తేలింది. అప్గ్రేడ్ చేయబడిన డోర్నియర్ ఫ్లీట్ ఇప్పుడు భారత వైమానిక దళం, నావికాదళం, కోస్ట్ గార్డ్ లో సేవలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టుల సక్సెస్ కంపెనీకి రానున్న కాలంలో మరిన్ని విజయాలను తెచ్చిపెట్టొచ్చని తెలుస్తోంది. రఫెల్ యుద్ధ విమానాల లాజిస్టిక్స్ విషయంలో కూడా కంపెనీ పాలుపంచుకోవటం గమనార్హం. కంపెనీ ప్రస్తుతం కొత్త తరం టెక్నాలజీలపై కూడా పనిచేస్తోంది.