జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదు

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదు

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్​ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని బీఆర్​ ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదు అయింది. 

గతంలో కూడా సునీత, ఆమె కూతురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శుక్రవారం (అక్టోబర్​31) ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని సునీతపై బోరబండ పీఎస్​ లో ఫిర్యాదు చేశారు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి. 

టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకువిచారణ చేసి బోరబండ పీఎస్​ కంప్లయింట్​ చేశారు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి. ఎన్నికల కోడ్​ ఉల్లంఘనపై ఇప్పటికే మాగంటి సునీతపై రెండు కేసులు నమోదు చేశారు. 

మజీద్​ దగ్గర ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం  చేశారని ఓ కసు.. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు పువ్వాడ అజయ్​, మల్లారెడ్డితో కలిసి  వెంకటగిరి లో భారీ ర్యాలీ నిర్వహించారని మరో కేసు నమోదు అయింది.