ఓయూ, వెలుగు: టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇంగ్లీష్ పుస్తకాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఓయూ ఆర్ట్స్కాలేజీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికానికి చదువు అడ్డు కాదని, దాన్ని జయించి ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్అయ్యేవారికి మాగి వెంకన్న రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.