హైవేకు మావోయిస్టుల నుంచి ముప్పు.. బీజాపూర్లో మరో బేస్ క్యాంప్

హైవేకు మావోయిస్టుల నుంచి ముప్పు.. బీజాపూర్లో మరో బేస్ క్యాంప్

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​ జిల్లాలో ఆదివారం మరో కొత్త బేస్​ క్యాంపు  ఏర్పాటైంది. మహారాష్ట్ర – చత్తీస్​గఢ్​ను అనుసంధానిస్తూ కొత్తగా నిర్మిస్తున్న హైవేకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో భూపాలపట్నం పోలీస్​స్టేషన్​పరిధి ఉల్లూరు పంచాయతీలోని చిల్లామర్కా అటవీలో బేస్ క్యాంపును నెలకొల్పారు. ఫర్సేగఢ్​, సేండ్ర, మహారాష్ట్ర బార్డర్​లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో  కదలికలను నియంత్రించేందుకు ఇది దోహదపడుతుంది.

 ఇప్పటికే బీజాపూర్​జిల్లాలో 36 బేస్​ క్యాంపులను దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 492 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2023 నుంచి ఇప్పటిదాకా  జరిగిన ఎన్ కౌంటర్లలో 193 మంది చనిపోయారు. 900 మంది అరెస్ట్ అయ్యారు.  మావోయిస్టుల నియంత్రణకు  బేస్​క్యాంపు లు ఏర్పాటు చేస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ  జితేంద్రయాదవ్ ​ తెలిపారు.