
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్లో ఈ షూట్ జరుగుతోంది. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ను కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసున్న ఆన్ లొకేషన్ స్టిల్ను రిలీజ్ చేశారు. ‘బ్యూటిఫుల్ మూమెంట్ ఫ్రమ్ ‘పెద్ది’ సెట్స్’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది టీమ్.
ఇద్దరూ చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ స్టిల్ ఆకట్టుకుంది. సుధీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్తో దాదాపు టాకీ పార్ట్ పూర్తవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రగ్డ్ లుక్లో కనిపించనున్నాడు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.