పాక్లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబసభ్యుల చేతిలోనే హతం

పాక్లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబసభ్యుల చేతిలోనే హతం

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లోని టెర్రరిస్ట్​సంస్థ లష్కరే తొయిబా కమాండర్​బిలాల్​ఆరిఫ్ సరాఫీ తన కుటుంబసభ్యుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. శనివారం రంజాన్​సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పంజాబ్​రాష్ట్రం మురిద్కేలోని మార్కజ్ సమీపంలో ఉన్న లష్కరే తొయిబా పాత హెడ్​క్వార్టర్స్​సమీపంలో ఈ ఘటన జరిగింది. 

కుటుంబ విబేధాలే హత్యకు దారితీశాయని ఇంటలిజెన్స్​వర్గాలు అనుమానిస్తున్నాయి. హంతకులను స్థానిక పోలీసులు అరెస్ట్​ చేసినట్లు తెలిపాయి. మురిద్కే సెంటర్‌‌‌‌‌‌‌‌లో యువకులను గుర్తించి, వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడం బిలాల్​ఆరిఫ్ ప్రధాన బాధ్యత. యువతకు సిద్ధాంతపరమైన శిక్షణ ఇచ్చి వారికి బ్రెయిన్‌‌‌‌‌‌‌‌వాష్ చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించేవాడు. 

దశాబ్దాలుగా ఉగ్రవాద నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లను పెంచి పోషించిన పాకిస్తాన్..  ఇప్పుడు అవే సంస్థల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో ఆ దేశంలో ఏకంగా 1,045 దాడులు జరగ్గా, వీటిలో 1,139 మంది మరణించారు. 1,595 మంది గాయపడ్డారు.