శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం

శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై జరిగిన పాశవిక ఘటన ఇంకా జనం కళ్ల ముందే మెదులుతుండగానే.. శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడి  ఆలయం పక్కనే కాలిపోయిన మహిళ శవం కనిపించింది.

సిద్ధులగుట్ట దేవాలయంలో పూజ చేసుకోవడానికి వచ్చిన అయ్యప్ప భక్తులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 6 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతురాలి చెప్పులు, బట్టలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది.. అత్యాచారం చేసి, హత్య చేశారా అన్న కోణంలోనూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాదితురాలు ఎవరన్న సమాచారం ఇంకా తెలియలేదు. ఆమె వయసు 35 ఏళ్లు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రియాంక రెడ్డి ఘటన జరిగిన తొండుపల్లి టోల్ ప్లాాజా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే  ఈ దారుణం జరిగింది. ప్రియాంక ఘటనపై పోలీసుల ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే మరో మహిళ అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది.