పాక్ స్పైగా యూపీ వ్యాపారి.. అరెస్టు చేసిన ఎస్టీఎఫ్

పాక్ స్పైగా యూపీ వ్యాపారి.. అరెస్టు చేసిన ఎస్టీఎఫ్

లక్నో: పహెల్గాం దాడి తర్వాత రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది.  తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ చేసినట్లు ఎస్టీఎఫ్ ప్రకటించింది. యూపీలోని రాంపుర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది.

ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్టీఎఫ్​ అధికారులు పేర్కొన్నారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్‌ వెళ్లొచ్చాడని, పాక్‌కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు. షాజాద్‌ భారత్‌లో పలు సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడన్నారు. యూపీలోని పలువురుని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్టు చెప్పారు.

ALSO READ | హరాన్యాలో మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్