కరోనా పనిపట్టే యాంటీబాడీ రెడీ అంటున్న ఇజ్రాయెల్​, నెదర్లాండ్స్​

కరోనా పనిపట్టే యాంటీబాడీ రెడీ అంటున్న  ఇజ్రాయెల్​, నెదర్లాండ్స్​

ఇజ్రాయెల్​, నెదర్లాండ్స్​ సైంటిస్టుల తయారీ
యూధుల మైండ్​సెట్​తోనే సాధ్యమైందన్న ఇజ్రాయెల్​ మంత్రి
మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామన్న నెదర్లాండ్స్​ సైంటిస్టులు
జెరూసలేం: కరోనా పనిపట్టే యాంటీబాడీ రెడీ అయిపోయింది. ఇటు ఇజ్రాయెల్​ సైంటిస్టులు, అటు నెదర్లాండ్స్​ సైంటిస్టులు కరోనా విరుగుడును తయారు చేశారు. రెండు దేశాల సైంటిస్టులు తయారు చేసిన ఆ విరుగుడు ‘ఒకటే రకం’! మనిషి నుంచి తీసిన మోనోక్లోనల్​ యాంటీ బాడీస్​ అవి. దానికి పేటెంట్​ కోసం ఇజ్రాయెల్​ ట్రై చేస్తుంటే, దానిని మరింత అభివృద్ధి చేసేందుకు నెదర్లాండ్స్​ కృషి చేస్తోంది. ఈ ఘనత సాధించింది ఇజ్రాయెల్​లోని ఇనిస్టిట్యూట్​ ఫర్​ బయోలాజికల్​ రీసెర్చ్​ (ఐఐబీఆర్​), నెదర్లాండ్స్​లోని యుట్రెచ్​ యూనివర్సిటీకి చెందిన ఎరాస్మస్​ మెడికల్​ సెంటర్​ అండ్​ హార్బర్​ బయోమెడ్​ సైంటిస్టులు.

మోనోక్లోనల్​ పద్ధతిలోనే ఈ యాంటీబాడీలు పనిచేస్తాయని, వైరస్​ను చంపేస్తాయని ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి నఫ్తాలీ బెన్నెట్​ ప్రకటించారు. దీనిపై పేటెంట్​కు అప్లై చేస్తామని, దానిని కమర్షియల్​గా తయారు చేసేందుకు వివిధ కంపెనీలతో మాట్లాడతామని ఆయన చెప్పారు. ‘యూధుల మైండ్​సెట్​, వాళ్ల క్రియేటివిటీతోనే ఇది సాధ్యమైంది’ అని అన్నారు. అయితే, మార్చిలోనే దీనికి సంబంధించి సైంటిస్టులు ఓ మంచి పద్ధతిని గుర్తించారని అక్కడి పేపర్​ ఓ వార్త రాసింది. ఇప్పుడు బెన్నెట్​ చెప్పిన ఈ యాంటీబాడీ అదేనా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మనుషులపై ట్రయల్స్​ గురించి కూడా ఆయన వెల్లడించలేదు.

ల్యాబ్​లో సక్సెస్​

నెదర్లాండ్స్​ సైంటిస్టులు తయారు చేసింది కూడా సేమ్​ అలాంటి యాంటీ బాడీనే. అయితే, దీనిపై ఇప్పటిదాకా ల్యాబ్​లోనే సైంటిస్టులు టెస్ట్​ చేశారు. కల్చర్డ్​ సెల్​లో దానిని ప్రయోగించారు. అందులో వైరస్​ను యాంటీబాడీ చంపేసినట్టు గుర్తించారు. ఈ యాంటీబాడీలతో వైరస్​ సోకినోళ్లలో అది మరింత పెరగకుండా కాపాడొచ్చని, ఇతరులకు వ్యాపించుకుండా చూడొచ్చని యుట్రెచ్​ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. ఈ యాంటీబాడీతో భవిష్యత్తులో కరోనాకు మంచి ట్రీట్​మెంట్​ను అందించొచ్చన్నారు. దీనిపై ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.