మీ ఐరన్ లెగ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: ఆడిపోసుకుంటున్న నెటిజెన్స్

మీ ఐరన్ లెగ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: ఆడిపోసుకుంటున్న నెటిజెన్స్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్ సేన 234 పరుగులకే పరిమితమైంది. ఆఖరి రోజు విజయానికి 280 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న కోహ్లీ (49), రహానె (46)లపై భారీ ఆశలే పెట్టుకున్నా ఆ ఇద్దరూ ఉసూరుమనిపించారు. ముఖ్యంగా విరాట్ పేలవ షాట్‌తో తన వికెట్ పారేసుకున్నాడు. అదే ఓవర్‌లో రవీంద్ర జడేజా కూడా వెనుదిరిరాగడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కోహ్లీ విఫలమవడానికి, టీమిండియా ఓడిపోవడానికి అనుష్క శర్మే కారణమని నెటిజన్స్ నిందిస్తున్నారు. ఆమెను స్టేడియంలోకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఓటములను ప్రస్తావిస్తూ అనుష్కను ట్రోల్ చేస్తున్నారు. 'ఐసిసి ఈవెంట్లలో అనుష్క శర్మ స్టేడియంలో ఉన్నప్పుడు టీమిండియా విన్నింగ్స్ పర్సెంటేజ్ 0..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక
విరాట్ అభిమానిగా చెప్పుకున్న ప్రదీప్‌సిన్హ్ అనే యూజర్.. 'అనుష్క శర్మను దయచేసి ఇకముందు మ్యాచులకు హాజరు కాకండి..' అని అభ్యర్థించాడు.  

దయచేసి ఇకముందు మ్యాచులకు హాజరు కాకండి..

"ప్రియమైన అనుష్క శర్మ గారు.. నేను విరాట్‌ కోహ్లీకి డైహార్డ్ ఫాన్‍ని. మీరు మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చిన స్టేడియంకు ప్రతిసారి నేను ఒక విషయాన్ని గమనించాను. మీరు హాజరైన ప్రతి సమయంలో విరాట్ తన లక్ష్యాలను చేరుకోలేదు. టీమిండియా గెలవలేదు. ఏ ఆటగాడు రాణించలేదు. కావున దయచేసి ఇకపై మ్యాచ్‌లకు హాజరు కాకపోవడం గురించి ఆలోచించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను..' అని ప్రదీప్‌సిన్హ్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు.