ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూపాయికే 100 చదరపు గజాల వరకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్. జనవరిలో అమ్మఒడి పథకం, కృష్ణ,గోదావరి కాల్వల శుద్ధికి మిషన్ ఏర్పాటు వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు
- అమ్మ ఒడికి రూ.15 వేల చొప్పున ఇవ్వడానికి రూ .6455 కోట్లు కేటాయింపు. తల్లి, లేదా సంరక్షకులకు ప్రతి ఏటా అందిస్తుంది. జనవరి నుంచి ప్రారంభం.
- 6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భవతులకు పౌష్టిక ఆహారం. 77 మండలాల్లో అందించేందుకు రూ305 కోట్లు
- కృష్ణ, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటు. సీఎం చైర్మన్ గా మిషన్ ఏర్పాటు.
- 130 పంటకాల్వల్లో మురుగునీరు కలుస్తున్న వాటిని గుర్తించి, అక్కడ మురుగుసుద్ది ప్లాంట్ ఏర్పాటు
- ఎస్సీ కార్పోరేషన్ ను 3 కార్పొరేషన్ లుగా ఏర్పాటు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ లుగా ఏర్పాటు
- వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్సార్ ప్రతిభ అవార్డ్ ల ఏర్పాటు.జనవరి 26, ఆగస్టు15న 50 మంది వంతున అవార్డ్, 10 లక్షల నగదు.
- హజ్, జెరూసలేం యాత్రికులకు సహాయం. 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 60 వేలు, 3 లక్షల పైన ఆదాయం ఉంటే రూ.30 వేలు
- కంకర నుంచి రోబో సాండ్ తయారు చేసేందుకు ప్రస్తుతం ఉన్న యూనిట్ ల అప్ గ్రేడ్ కు చేసుకునే వారికి 1.5 కోట్ల వరకు పావలా వడ్డీకే రుణాలు.
- 100 గజాల వరకు ఇంటి రిజిస్ట్రేషన్ రూ.1 .100 నుంచి 300 గజాల వరకు మార్కెట్ విలువ ప్రకారం రెగ్యులైజ్ .
- గ్రామీణ,వార్డు స్థాయిలో 397 అదనపు జెఎల్ఎం పోస్టుల భర్తీకి ఆమోదం.