అమరావతి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు రైతులు. సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని లేఖలో తెలిపారు. కేవలం సీఎం, పలువురి స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా తమ గోడు వినిపించుకున్నవారు లేరని లేఖలో రాజధాని రైతులు వాపోయారు. ‘అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు.. మాకు మరణమే శరణ్యం. మా యందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రాజధాని రైతులు పేర్కొన్నారు.
మేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి రైతుల లేఖ
- ఆంధ్రప్రదేశ్
- January 1, 2020
లేటెస్ట్
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
- విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
- పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
- మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
- చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!