AP News: లక్ష 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కార్..! ఏం చేసిందంటే?

AP News: లక్ష 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కార్..! ఏం చేసిందంటే?

AP Welfare Schemes: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక్కో పథకం అమలును కొనసాగిస్తోంది. ఈ ఏడాది స్కూళ్లు తెరుచుకున్న వేళ అర్హులైన పిల్లల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బు జూన్ 25 నాటికి అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తాను గత ప్రభుత్వంతో పోల్చితే ఏ స్కీములోనూ తక్కువ సొమ్ము లబ్ధిదారులకు అందించటం లేదని కూటమి సర్కార్ చెబుతోంది. 

ఇప్పటికే అప్పుల భారంతో మునిగిపోయామని అయినప్పటికీ తమ శక్తికి మించి హామీల అమలు కోసం పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే అనేకమార్లు సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పథకాల భారాన్ని తగ్గించేందుకు అడుగులు వేస్తోందని వెల్లడైంది. ఖజానాపై భారం తగ్గించేందుకు ఏపీలో వివిధ ప్రభుత్వ పథకాలను పొందుతున్న లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులను లబ్ధిదారుల జాబితా నుంచి గుర్తించి తొలగించేసింది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు షాక్ అవుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులుగా చేరి అనేక పథకాల ప్రయోజనాలను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు లొసుగులను ఉపయోగించుకుని పథకాలను పొందుతున్నారని భావించటంతో అలాంటి వారిని ఏరిపారేయాలని స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందికి ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో మరింత మందిని ఇలా గుర్తించి పథకాలకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

►ALSO READ | తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయం కూల్చేశారు : విగ్రహాన్ని నదిలో పడేశారు..!

చంద్రబాబు ప్రభుత్వం కేవలం అర్హులకు మాత్రమే పథకాలను అందించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని భావించటమే ప్రస్తుత పరిణామాలకు కారణంగా తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కూడా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బడ్జెట్లో దానికి కోసం కేటాయింపులకు తగ్గట్టుగా ఆదాయాలను సమకూర్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మెుత్తానికి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారటం కొందరిని ఆవేదనకు గురిచేస్తోంది.