ఏపీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు గవర్నర్ తో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్సెండ్ చేసింది. దీనిపై జగన్ గవర్నర్ కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు విశాఖలో జరిగే జీ 20 ప్రతినిధుల సమావేశం వివరాలను గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు సీఎం మార్చి 28 న విశాఖ చేరుకోనున్నారు.