ఏపీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన
ఈ నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరిన జగన్
అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ న్యాయస్థానం
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన కోర్టులో విచారణకు హాజరుకాలేదు. ఏపీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు కోర్టుకు రాలేనని సీఎం జగన్ సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను అర్థం చేసుకున్న సీబీఐ న్యాయస్థానం నేటి గైర్హాజరీకి అంగీకరించింది.
తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో కోర్టు
విచారణకు స్వయంగా హాజరవడంపై మినహాయింపు ఇవ్వాలంటూ సీఎం జగన్ పెట్టుకున్న పిటిషన్ను
న్యాయస్థానం ఇటీవలే కొట్టేసి, విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది.