కడపలో సీఎం జగన్ టూర్… నేడు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

కడపలో సీఎం జగన్ టూర్… నేడు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నుంచి సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. మూడు రోజుల టూర్ లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సోమవారం జమ్మలమడుగు వద్ద ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒప్పందం  చేసుకోవడంతో ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అదే రోజు రిమ్స్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వైఎస్ఆర్  ఉచిత భోజన వసతి భవనం, రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎఎస్ఆర్ సమాధి వద్ధ నివాళి అర్పిస్తారు. రాయచోటి సభలో పాల్గొంటారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. స్థానిక జూనియర్ కాలేజీలో వైఎస్ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. అదే రోజు అమరావతిలోని నివాసానికి చేరుకోనున్నారు.