రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో డిస్కస్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి అమిత్ షా సహా కొందరు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకుంటారు.

సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటలకల్లా విశాఖపట్నం చేరుకుంటారు. సాయిప్రియా రిసార్ట్స్‌లో అరుకు ఎంపీ జి. మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాత.. అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు.

రేపు అక్టోబర్ 21 సందర్భంగా.. ఉదయం 8 గంటల టైమ్ లో పోలీసు సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. అమరులైన పోలీసులకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జగన్ శ్రద్ధాంజలి అర్పిస్తారు.