జగన్.. మీకిదే చివరి ఛాన్స్: సీబీఐ కోర్టు

జగన్.. మీకిదే చివరి ఛాన్స్: సీబీఐ కోర్టు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈనెల 26కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అలాగే కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరిన జగన్ కు.. ఇదే చివరి అవకాశం అని కోర్టు తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరో అవకాశం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది.