
తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. భక్తుల ప్రవేశం గురించి టీటీడీ ఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం కొన్ని షరతులతో భక్తుల ప్రవేశానికి ఒప్పుకుంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్ టీటీడీకి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. మరి ఉత్తర్వుల జారీతో భక్తులకు ప్రవేశం టీటీడీ ఎప్పటినుంచి కల్పిస్తుందో చూడాలి.