ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- ...పెరిగిన HRA.. ఎంతంటే..

ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- ...పెరిగిన HRA.. ఎంతంటే..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్  సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉద్యోగుల HRA పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో పని చేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం HRA పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 12 శాతం HRAను 16 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, భీమవరం, పుట్టపర్తి, రాజమండ్రి, నరసరావు, రాయచోటి జిల్లా ఉద్యోగులకు పెంపు వర్తించనుంది.

ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్టు మే 1న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు జీవోలు విడుదల చేసింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.66... పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67 తీసుకువచ్చారు. ఈ డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. కాగా, తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగుతుంది.