లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి. కొన్ని షరతులతో కొన్ని ప్రాంతాల్లో వైన్ షాపులు తెరచుకున్నాయి. ఏపీలో కూడా కొన్ని షరతులతో సోమవారం మద్యం షాపులు తెరచుకున్నాయి. చాలా రోజుల తర్వాత వైన్ షాపులు తెరచుకోవడంతో జనాలు మందుకోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అయితే రాష్ట్రంలో మందును కంట్రోల్ చేయడంతో పాటు.. సోషల్ డిస్టెన్సింగ్ కూడా అమలుకావాలంటే మద్యం ధరలు పెంచడమే మార్గమని ఏపీ ప్రభుత్వం భావించింది. దానికనుగుణంగా సోమవారం షాపులు తెరవాడానికి ముందే మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మందుకోసం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్యూలో నిలబడి మరీ కొనుగోలుచేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు నేటి మధ్యాహ్నం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో పేర్కొంది. అందుకే మద్యం ధరలను పెంచుతూ మద్యాన్ని అందరికీ దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిందని భావిస్తున్నారు. మొత్తంగా లాక్డౌన్ పుణ్యమా అని ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో 15 శాతం మద్యం దుకాణాలను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎంవో కార్యలయం నుంచి సమాచారం.
మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్
- May 5, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు