ఏపీలో రెండు రోజులపాటు వడగాలులు.. హెచ్చరికలు జారీ

ఏపీలో రెండు రోజులపాటు వడగాలులు.. హెచ్చరికలు జారీ

మరో రెండు  రోజులు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకి వెళ్లాలని అధికారులు సూచించారు.రేపు ( జూన్11) 50 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 100 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 119 మండలాల్లో వడగాల్పులు వీచే  అవకాశం ఉందని తెలిపారు. శనివారం( జూన్10)  విజయనగరం  జిల్లా అక్కివరంలో 44.8°C, విశాఖ జిల్లా పద్మనాభం, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.7°C, నెల్లూరు జిల్లా ఉదయగిరి, శ్రీకాకుళం జిల్లా పలాసలో 45.6°C, అనకాపల్లిలో  44.3°C  అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 60 మండలాల్లో తీవ్రవడగాల్పులు,116 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.  పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపుఅక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.