
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం రేపు( శుక్రవారం, జూన్12) విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్, సెంకర్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ఉన్నప్పటికీ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు… ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు.