నన్ను గోకితే.. మూల్యం చెల్లించుకొంటారు.. త్రివిక్రమ్‌కు అంబటి వార్నింగ్

నన్ను గోకితే.. మూల్యం చెల్లించుకొంటారు.. త్రివిక్రమ్‌కు అంబటి వార్నింగ్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తనని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు  విమర్శించారు. ముఖ్యంగా తెరపై పవన్‌ నటించిన తీరు అభిమానులను అలరిస్తోంది.  తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలను, నటులను, దర్శకులకు, త్రివిక్రమ్ లాంటి రచయితలకు.. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే.. ఇలాంటి గుణపాఠాలు నేర్చుకొంటారని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు 

రాజకీయ నాయకులను సినిమాల్లో పెట్టి అక్కడక్కడ గోకే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సినిమాల్లో ఎవరిని పడితే వారిని గొకితే సక్సెస్ కావు. దమ్ముంటే పొలిటికల్ సైటెర్స్ తీయవచ్చు. శ్యాంబాబు కాకపోతే రాంబాబు అని పేరు పెట్టుకోవచ్చు. నా డ్యాన్స్ సింక్ కాలేదని అంటున్నారు. నేను డ్యాన్స్ మాస్టర్‌నా? మా అన్నయ్య డ్యాన్స్ మాస్టరా? అని నిర్మాతలు తెలుసుకోవాలి అని అంబటి రాంబాబు అన్నారు. బ్రో సినిమా కోసం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు.

 తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలను, నటులను, దర్శకులకు, త్రివిక్రమ్ లాంటి రచయితలకు.. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే.. ఇలాంటి గుణపాఠాలు నేర్చుకొంటారని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.  . తగిన మూల్యం చెల్లించుకొంటారంటూ... . ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంబటి రాంబాబు తెలిపారు. సినిమాల్లో ఉంటూ రాజకీయాల్లో చేస్తే..ఒకటి మాత్రం జరగడ ఖాయం. సినిమాలు వదలకపోతే.. సినిమాలు నాశనం అవుతాయి. రాజకీయాలు నాశనం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి కూడా సినిమాలు చేయలేదు అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు