టాలీవుడ్ సమస్యలపై నిన్న సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.అయితే ఈ భేటికి మంచు ఫ్యామిలీ దూరంగా ఉండటం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్వయంగా హైదరాబాద్ లోని సినీ నటుడు మోహన్ బాబు ఇంటికెళ్లారు. ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై మోహన్ బాబుతో చర్చించారు. నిన్న చిరంజీవి బృందం సీఎం జగన్ తో జరిగిన సమావేశం వివరాలను మోహన్ బాబుకు వివరించారు నాని. ఈ విషయంపై మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘మంత్రి పేర్ని నాని మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. టిక్కెట్ ధరపై మీ చొరవతో పాటు TFI కోసం AP ప్రభుత్వ ప్లాన్లపై మాకు అప్డేట్ చేసినందుకు ధన్యవాదాలు. TFI ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు’అని అన్నారు.
It was a absolute pleasure hosting you at our home Sri. Nani garu. Much thanks for protecting the interests of TFI ? pic.twitter.com/HjV3pK8yYJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022