ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇటీవల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వారాహి యాత్రను జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పవన్ ప్రజల దృష్టిలో విలన్గా మారుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవసరం కోసం స్క్రీప్ట్ ఇచ్చి పవన్తో బూతు పురాణం మాట్లాడిస్తున్నారని అన్నారు.
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి ఆర్కే.రోజా ఘాటు విమర్శలు చేశారు. ఆటలో అరటిపండు లాంటి పవన్ కళ్యాణ్ జగన్ ను ఓ ఆట ఆడిస్తాడా అని సెటైర్లు వేశారు. పవన్ తన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు.. అలాంటి పవన్ జగన్ ని ఒక ఆట ఆడిస్తాడంట అని సెటైర్లు వేశారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరవమంటే అరుస్తూ.. కరవమంటే కరుస్తాడని మంత్రి రోజా విమర్శించారు. పవన్ కి ఒక జెండా లేదు ఎజెండా లేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు మాటలు కాకుండా చిరంజీవి మాట వింటే పవన్కు మంచిదని, మీరు సింగిల్గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా 2024లో ఏపీ సీఎం మళ్లీ జగనేనని, ఇది రాసిపెట్టుకోండంటూ తనదైన స్టైల్లో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటివాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే పవన్ పని అని.. సొంత తల్లిని, పార్టీని తిట్టినా ప్యాకేజీకి కక్కుర్తి పడిన వ్యక్తి పవన్ అని అన్నారు. చంద్రబాబు చాదస్తంతోనే పిచ్చివాగుడు వాగుతున్నాడని.. చంద్రబాబు నిజంగా సింహం లాంటివాడు అయితే సింగిల్ గా పోటీ చేయాలని మంత్రి రోజా సవాల్ చేశారు.