బీజేపీ వస్తే అవ్వకు, తాతకు పింఛనొస్తది : మిథున్​ రెడ్డి

బీజేపీ వస్తే అవ్వకు, తాతకు పింఛనొస్తది :  మిథున్​ రెడ్డి

పాలమూరు/హన్వాడ, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అవ్వకు, తాతకు పింఛన్​ వస్తదని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్​ రెడ్డి అన్నారు.  మంగళవారం అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఎస్వీఎస్, మెట్టుగడ్డ, న్యూ టౌన్, వన్​టౌన్​, గడియారం చౌరస్తా వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం కార్నర్​ మీటింగ్​లో మిథన్​ మాట్లాడుతూ కాంగ్రెస్ ను గెలిపిస్తే మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్లడం ఖాయమన్నారు.  

అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరులో ఎమ్మెల్యే టాక్స్ అనేది లేకుండా చేస్తానన్నారు.  అబద్దాల కాంగ్రెస్ కావాలా? దోపిడీ, దౌర్జన్యాలు చేసే బీఆర్ఎస్ కావాలా? రామరాజ్యం తెచ్చే బీజేపీ కావాలో   ఆలోచన చేయాలన్నారు. 30న కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం హన్వాడ మండలంలో ప్రచారం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని సింహగిరి, హనుమాన్ చౌరస్తా, కొత్త చెరువు ప్రాంతాల్లో మిథున్​ సతీమణి  రిషికా రెడ్డి ప్రచారం చేశారు. కార్యక్రమంలో  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,  బాలరాజు,  వీర బ్రహ్మచారి,  సుదర్శన్​ రెడ్డి,  కృష్ణవర్ధన్ రెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రవీణ్ యాదవ్.  నారాయణ యాదవ్ పాల్గొన్నారు.