పోలీసులకు కియా వాహనాలు 

పోలీసులకు కియా వాహనాలు 

దేశంలోనే పోలీసుల కోసం ప్రత్యేకంగా కియా సంస్థ వాహనాలను రూపొందించింది. ప్రత్యేక సదుపాయాలను ఈ వాహనంలో సమకూర్చి మరీ సిద్ధం చేసింది. ఏపీ పోలీసుల కోసం రెండు వాహనాలను సిద్ధం చేసింది. దీనిని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి కియా ప్రతినిధులు చూపించారు. పెట్రోలింగ్, ఇంటర్ సెపటర్స్ ను డీజీపీ ఈ సందర్భంగా పరిశీలించారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ వాహనాలను సిద్ధం చేసినట్లు కియా సంస్థ ప్రతినిధులు ప్రీతం డీజీపీకి వివరించారు.
 ఆధునిక సౌకర్యాలతో..
 ఈ ప్రత్యేక వాహనాల్లో ఇంకా అదనపు సౌకర్యాలను కూడా సమకూర్చేటందుకు కియా సంస్థ డీజీపీ సూచనలను తీసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించామని కియా సంస్థ ప్రతినిధులు రూపొందించారు. వాహనాలను చూసిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన మరిన్ని సౌకర్యాలను కూడా కల్పించేందుకు కియా సంస్థ సిద్ధంగా ఉందని వారు తెలిపారు.