- 24 గంటల్లో 462 కేసులు నమోదు
- 8 మంది మృతి
అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులే నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి వారిలో 15 మందికి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి వైరస్ సోకినట్లు అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 7858 కాగా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 9834కు చేరాయి. ఇప్పటి వరకు 3566 మంది డిశ్చార్జ్ అయ్యారు. 4173 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 24 గంటల్లో 8 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, గుంటూరులో, కడపలో ఒక్కోరు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఒక్కరోజులో 20,639 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు