
న్యూఢిల్లీ: 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ దాటి, ఈ లెవెల్ పైన క్లోజయిన మొదటి లిస్టెడ్ కంపెనీగా యాపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. యాపిల్ షేర్లు శుక్రవారం సెషన్లో 2.3 శాతం పెరిగి 193.97 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 3.04 ట్రిలియన్ డాలర్లను తాకింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నివిడియా వంటి టెక్ కంపెనీలు ఈ ఏడాది బాగా పెరగడంతో ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ మొదటి ఆరు నెలల్లో 16 శాతం గ్రోత్ నమోదు చేసింది. యాపిల్ కిందటేడాది జనవరిలోనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్ను టచ్ చేసింది.
కానీ, ఆ లెవెల్ను హోల్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు భారీగా పడడంతో యాపిల్ మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు కూడా పడింది. విజన్ ప్రో ప్రొడక్ట్ను లాంచ్ చేయడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. వర్చువల్ రియాల్టీతో ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది. లిస్టెడ్ కంపెనీల్లో అత్యంత విలువైన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 2.5 ట్రిలియన్ డాలర్లు.