11 ఏళ్ల తర్వాత స్పెషల్ రంగుల్లో ఐఫోన్

11 ఏళ్ల తర్వాత స్పెషల్ రంగుల్లో ఐఫోన్

యాపిల్.. ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 14 సిరీస్ లో కొత్త కలర్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2012లో లాంచ్ అయిన ఐఫోన్ 5, ఐఫోన్ 5సీల్లో తీసుకొచ్చిన పసుపు కలర్ ని మళ్లీ ఇప్పుడు ఐఫోన్ 14 సిరీసుల్లో తీసుకురాబోతోంది. అయితే, ఈ రంగు కాస్త బనానా ఎల్లో (అరటి పసుపును) ను పోలి ఉంటుందని తెలిపింది. వీటిని త్వరలో భారతీయ మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. అయితే, ఐఫోన్ 14 సిరీస్ పాత ధర కాకుండా ఈ స్పెషల్ కలర్ కు ధర పెంచింది. రూ.79,900 ఉన్న ఫోన్ ధరను రూ.89,900 లకు పెంచింది. ఈ నిర్ణయంపై టెక్ వర్గాలు రకరకాల కామెంట్స్ ఇస్తున్నాయి. కేవలం కలర్ మార్చి పదివేల రూపాయలు ధర పెంచడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధిచిన ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. మార్చి 10 నుంచి ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి. యాపిల్ వెబ్ సైట్ తో పాటు వివిధ ఆన్ లైన్ సైట్ లల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఐఫోన్ 14 సిరీస్  రెడ్, గ్రీన్, వైట్, బ్లా్క్ కలర్స్ లో అందుబాటులో ఉంది.