ఆపిల్ ఫోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

ఆపిల్ ఫోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

ఇండియాలో యాపిల్ తొలి స్టోర్

న్యూఢిల్లీ: ఇండియాలో ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్. యాపిల్‌ తన తొలి ఆన్‌‌లైన్ స్టోర్‌‌ను ఇండియాలో ఈ ఏడాదే తెరవనున్నట్టు ప్రకటించింది. అంతేకాక తన తొలి ఫిజికల్ రిటైల్ స్టోర్‌‌ను కూడా వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. కాలిఫోర్నియాలో జరిగిన కంపెనీ యాన్యువల్ షేర్‌ హోల్డర్స్ మీటింగ్‌‌లో ఒక షేర్‌ హోల్డర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ప్రకటన చేశారు. డొమెస్టిక్ పార్టనర్ సాయంతో కాకుండా.. తమకు తాము ఇండియాలోకి వెళ్లాలని చూస్తున్నామని టిమ్ కుక్ అన్నారు. దీని కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నాయని చెప్పారు. తమ కోసం ఒకరు ఇండియాలో బ్రాండ్‌‌ను రన్ చేయాల్సినవసరం లేదని పేర్కొన్నారు. అయితే స్టోర్ ఎప్పుడు ఎక్సాట్‌‌గా లాంచ్‌ చేస్తున్నారో టిమ్ కుక్ రివీల్ చేయలేదు.

For More News..

బడులకు నిప్పు… సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య