V6 News

పీఎం ఇంటర్న్షిప్ కు దరఖాస్తులు

పీఎం ఇంటర్న్షిప్ కు దరఖాస్తులు

యాదాద్రి, వెలుగు:ప్రధానమంత్రి ఇంటర్న్​ షిప్​ స్కీమ్​కు అప్లయ్​ చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్​ పడాల రవీందర్​ కోరారు.   25 ఏండ్లలోపు ఉన్న పదో తరగతి ఆపై చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకూ ప్రతి నెల రూ. 9 వేలు స్టైఫండ్​గా అందుతుందని చెప్పారు.