హైదరాబాద్, వెలుగు : ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్లో ఆరు నెలలుగా కమిషనర్లు లేకపోవడంతో 12వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి గుర్తు చేశారు. చీఫ్ కమిషనర్తో పాటు కమిషనర్లను వెంటనే నియమించాలని శుక్రవారం సీఎస్ శాంతి కుమారికి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. కమిషనర్లను నియమించాలని తాము హైకోర్టులో పిల్ దాఖలు చేశామని పేర్కొన్నారు.
నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకుందని గుర్తు చేశారు. ఈ నెల 12 వరకు ఆర్టీఐ కమిషనర్ల పోస్టులకు 281 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారిని నియమించాలని కోరారు. చీఫ్ కమిషనర్తో పాటు, కమిషనర్లుగా నియమితులయ్యేవారు అన్ని రంగాల్లో అనుభవం కలిగి ఉండేలా చూడాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించకూడదని కోరారు.

