క్రీడల్లో సత్తాచాటిన రాజ్​భవన్​ స్కూల్​ స్టూడెంట్స్​

క్రీడల్లో సత్తాచాటిన రాజ్​భవన్​ స్కూల్​ స్టూడెంట్స్​

ఖైరతాబాద్, వెలుగు: రాజ్​భవన్ ​ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో సత్తా చాటారు.  ఖైరతాబాద్​ జోన్​లోని డాన్​బాస్కో స్కూల్​లో జరిగిన ఖోఖో అండర్–14లో బాలురు ప్రథమ బహుమతి, అండర్​–17 విభాగంలో రెండో బహుమతి పొందారు.  బాలికల విభాగంలో అండర్–14, 17లో  ద్వితీయ బహుమతి పొందినట్టు హెచ్ఎం కరుణశ్రీ తెలి పారు.  నాంపల్లిలోని శంకర్​మెమోరియల్​ పాఠశాలలో జరిగిన ఆర్చరీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి వైభవ్ ​ప్రథమ బహుమతి పొందినట్టు పేర్కొన్నారు.  రాజ్​భవన్​ స్కూల్​లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం జాస్​ అలూకాస్ ​నగలషాపు నిర్వాహకులు 1,43,445తో మ్యూజిక్​ సిస్టమ్​తోపాటు క్రీడా సామాగ్రిని అందజేశారు. గోపాల్, సునీత పాల్గొన్నారు.