ఉగ్రవాదుల చేతిలో PoK : ఆర్మీ చీఫ్ రావత్

ఉగ్రవాదుల చేతిలో PoK : ఆర్మీ చీఫ్ రావత్

గిల్గిత్ బల్టిస్తాన్ కూడా భారత్ లో అంతర్భాగమేనన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.ఆర్మీ కమాండర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో శుక్రవారం మాట్లాడుతూ…  ప్రస్తుతం పీవోకే పాక్ ప్రభుత్వం చేతిలో లేదని.. పూర్తిగా ఉగ్రవాదుల హ్యాండోవర్ లోకి వెళ్లిపోయిందన్నారు. ఉగ్రవాదులు చెప్పుచేతల్లో ఉన్న ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ .. అన్నారు . జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు దెబ్బతీసేలా పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని చెప్పారు. 370 ఆర్టికల్ తీసుకువచ్చినపుడు నోరుమెదపని పాక్.. తీసివేసినపుడు మాత్రం కావాలనే రాద్ధాంతం చేస్తుందని అన్నారు.