ఉత్తరాఖండ్​లో ఆర్మీ జవాన్ సూసైడ్

ఉత్తరాఖండ్​లో ఆర్మీ జవాన్ సూసైడ్

మొగుళ్లపల్లి( టేకుమట్ల )వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కొలుగూరి కార్తీక్ (31) శనివారం రాత్రి ఉత్తరాఖండ్ లోని మినీతాల్ జిల్లా హల్దియాని ఓటి వలిలోని తన ఇంట్లో ఉరేసుకున్నాడు.  మండల కేంద్రానికి చెందిన కొలుగూరి రవి-, సమ్మక్క దంపతులకు కూతురు,  ఇద్దరు కొడుకులు.    చిన్న కొడుకు కార్తీక్  2012 లో ఆర్మీ  జవాన్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు.  

2020లో రేగొండ మండలం జగ్గయ్యపల్లికి చెందిన మేనమామ కూతురు ప్రవళిక పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.  పెండ్లి అయినప్పటి నుంచి కార్తీక్ తన భార్యను ఆమె పుట్టింట్లోనే  ఉంచి సెలవు దినాల్లో వచ్చిపోతుండేవాడు.  నెల రోజుల కింద ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమానికి హాజరైన  కార్తీక్​..  అనంతరం భార్యాపిల్లలతో కలిసి ఉత్తరాఖండ్ కు వెళ్లాడు. ఉన్నట్టుండి అర్ధరాత్రి అతను ఉంటున్న ఇంట్లోనే  ఉరేసుకోవడం చర్చనీయాశంగా మారింది.