న్యూఢిల్లీ: ప్రతి ఏటా జనవరి 15న నిర్వహించే ఆర్మీ డే పరేడ్ ను వచ్చే ఏడాది ఢిల్లీ బయట నిర్వహించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది సదరన్ కమాండ్ ఏరియాలో ఆర్మీ డే పరేడ్ ను నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సదరన్ కమాండ్ లో రెండు కార్ప్స్ ఉన్నాయి. ఒక కార్ప్స్ కు జోధ్పూర్ హెడ్ క్వార్టర్ కాగా... మరొక కార్ప్స్ కు భోపాల్ హెడ్ క్వార్టర్. లెఫ్టినెంట్ జనరల్ జై సింగ్ నైన్ ప్రస్తుతం సదరన్ ఆర్మీ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Indian Army decides to shift the Army Day Parade held every year on January 15 in Delhi outside the national capital. Next year’s Army Day parade will be held in the Southern Command area: Indian Army officials pic.twitter.com/WgAvZR4s59
— ANI (@ANI) September 19, 2022
ఢిల్లీ బయట ఆర్మీ డే పరేడ్ ను నిర్వహించాలన్న ఇండియన్ ఆర్మీ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. స్టాటిక్ ఫార్మేషన్లలో మహారాష్ట్ర, గుజరాత్ గోవా ఏరియాలు ఉండగా... దాని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. అలాగే దక్షిణ్ భారత్ ఏరియా హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది.