రోడ్డెక్కిన ఉపాధి కూలీలు

రోడ్డెక్కిన ఉపాధి కూలీలు

మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్​పల్లిలో సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని, చేసిన పనికి కొలతలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు చేసిన పనికి రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకే అకౌంట్లలో పడ్డాయన్నారు. వారం రోజుల నుంచి పనులు కావాలని అడిగితే 2 రోజులు పనులు కల్పించి మిగతా రోజులు ఖాళీగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల నుంచి పనులు లేక  ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.