5 కిలోల మామిడి పండ్లు రూ.350..ఫోన్​లో ఆర్డర్​ చేస్తే మీ ఇంటికే

5 కిలోల మామిడి పండ్లు రూ.350..ఫోన్​లో ఆర్డర్​ చేస్తే మీ ఇంటికే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగుఫోన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే మామిడి పండ్లను డెలివరీ చేసేందుకు రాష్ట్ర ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి ఆర్డర్​పై మామిడి పండ్లను సరఫరా చేయనుంది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా రైతుల నుంచి మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు చేర్చాలని ఉద్యాన శాఖ, ఉద్యాన అభివృద్ధి సంస్థ నిర్ణయించాయి. రైతుల తోటల నుంచే మామిడి కాయలను సేకరిస్తుంది. సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 5 కిలోల చొప్పున(12 నుంచి 15 కాయలు) ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పోస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సరఫరా చేయనుంది. 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.350గా నిర్ణయించారు. ఎన్ని బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కావాలన్నా బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చని, ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతాయని ఉద్యానశాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్రామిరెడ్డి చెప్పారు. 7997724925, 7997724944 నంబర్లకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్​ చేసి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయవచ్చన్నారు. 7997724925 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే చేసి పూర్తి అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే వారు ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమయ్యేలా అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్​ 013910100083888, ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​సీ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీబీ0000139కు మనీ పంపాల్సి ఉంటుంది.