- మంత్రి అజారుద్దీన్
- దట్టీలు సమర్పించి, ప్రార్థనలు
చార్మినార్, వెలుగు: మొహర్రం ధర్మం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ప్రపంచమంతా స్మరించుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బుధవారం బీబీ కా అలావా(డబీర్పురూ పరిసరాలు)ను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత బస్తీలోని డబీర్పురాలో మొహర్రం10వ రోజు(యాషూరా) బీబీ–కా–ఆలం ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. సంబంధిత ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు.
అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆశిర్ఖానాలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తూ పనులను చేయించాలని ఆదేశించారు. యాకుత్పురా దర్వాజా ఆశిర్ఖానాలోని పీర్లను సందర్శించి, దట్టీలు సమర్పించారు. ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ఉల్ హసన్, ఎఫెండి, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్కమిషనర్ సత్యనారాయణ, మీర్చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, రెయిన్ బజార్ ఇన్స్పెక్టర్ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
