రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి మొదటి విడుత కరోనా వ్యాక్సినేషన్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు 3.60 లక్షల డోసులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు పంపిణీ చేసేందుకు 139 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 99 ప్రభుత్వ, 40 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయన్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ భద్రత కోసం 800 కోల్డ్ స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. కోఠి నుంచి వ్యాక్సిన్ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వ్యాక్సిన్ను 2 నుంచి 8 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు 13వేల 900 మంది హెల్త్వర్కర్లకు వ్యాక్సినేషన్ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రానికి 16 లక్షల సిరెంజ్లు చేరాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10 లక్షల మంది ఉద్యోగులను ఆరోగ్యశాఖ రెడీ చేసింది.