దొంగనోట్లు తయారు చేస్తున్న దంపతుల అరెస్ట్
రూ.10.09 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
వరంగల్, వెలుగు: కరెన్సీ నోట్లను కలర్ప్రింట్తీసి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను వరంగల్ టాస్క్ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. వారి నుంచి రూ.10,09,960 విలువైన నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, బాండ్పేపర్లు, కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా. తరుణ్జోషీ వెల్లడించారు. వరంగల్నగరం కాశీబుగ్గ తిలక్రోడ్డు ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్, సరస్వతి భార్యాభర్తలు. రమేశ్కాశీబుగ్గ ప్రాంతంలో చికెన్సెంటర్నడుపుతుండగా.. సరస్వతి ఫ్యాన్సీ దుకాణంతో పాటు మ్యారేజ్బ్యూరో నిర్వహించేది. బిజినెస్సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేక్ కరెన్సీపై దృష్టి పెట్టారు. నకిలీ నోట్లు తయారు చేసి రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్లాన్వేశారు.
రష్ ఏరియాల్లో మార్పిడి
ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి స్కానర్తో కూడిన ప్రింటర్ఒకటి కొనుగోలు చేశారు. దాంతోపాటు కరెన్సీకి అవసరమైన బాండ్పేపర్లను సమకూర్చుకున్నారు. తర్వాత అసలు కరెన్సీ రూ.2 వేల నుంచి రూ. 10 వరకు అన్ని నోట్లను ముందుగా స్కాన్ చేశారు. తర్వాత ఆ నోట్లను కలర్ప్రింట్ చేసేవారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా మార్చుకునేందుకు సిటీలోని రష్ ఏరియాలను ఎంచుకునేవారు. ఇలా హన్మకొండ, వరంగల్ ఏరియాల్లో రద్దీగా ఉండే షాపుల్లో నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. కొద్దిరోజులుగా వరంగల్ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో ఫేక్నోట్లు చెలామణి అవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీపీ తరుణ్ జోషీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్, ఇంతేజార్గంజ్పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు కాశీబుగ్గలోని రమేశ్ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఫేక్ నోట్లను గుర్తించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ నోట్లు ప్రింట్ చేసేందుకు ఉపయోగించే ప్రింటర్, రూ.2 వేల ఫేక్నోట్లు 376, రూ.500 నోట్లు 204, రూ.200 నోట్లు 420, రూ.100 నోట్లు 471, రూ.50 నోట్లు 471, రూ.20 నోట్లు 62, రూ.10 నోట్లు 7 స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న దంపతులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ అభినందించారు.