
జీడిమెట్ల, వెలుగు: బీజేపీ మహిళా కార్యకర్తపై దాడిచేసిన జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. దీంతో జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. వారిని అరెస్టు చేసి సనత్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కార్పొరేటర్ జగన్ అతని అనుచరులు మహిళపై భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ వాసు, హనుమంతరెడ్డి, భరత్ సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
For More News..