ఎస్టీయూ మండిపాటు
హైదరాబాద్, వెలుగు: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) నుంచి తిరిగి పాత పెన్షన్విధానం (ఓపీఎస్)లోకి వెళ్లాలనుకొనే రాష్ట్రాలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)లో జమ చేసిన వాటా సొమ్మును ఇవ్వబోమనడం కేంద్ర ప్రభుత్వ అహంకార, ఎగవేత ధోరణికి నిదర్శనమని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) మండిపడింది.
దీని వల్ల 80 లక్షల మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, యం. పర్వత్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం నిర్బంధ చట్టం కాదని, రాష్ట్రాలు ఎప్పుడైనా సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారే వీలుందన్న విషయాన్ని కేంద్రం మరిచిందని ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి బి. భుజంగరావు విమర్శించారు.